సూపర్ ట్విస్ట్ తో ఎటో వెళ్ళిపోయింది మనసు ప్రోమో!
on Apr 25, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్స్ లో ' ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్' ఒకటి. ఈ సీరియల్ కి ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువగా ఉంది. అయితే ఈ సీరియల్ ప్రతీ ఎపిసోడ్ ట్విస్ట్ లతో సాగుతోంది.
నిన్న మొన్నటిదాకా సిరి, ధనల ఇష్యూ సాగగా.. నేటి ప్రోమోలో అభి ఏకంగా ఇంటికే వస్తాడు. దాంతో కథ మరింత ఆసక్తికరంగా మారింది. మాణిక్యం వన్ మ్యాన్ షోగా సీతాకాంత్ ఎత్తులు ఓవైపు.. శ్రీలత తెగింపు మరోవైపు సాగుతుంది. గత జన్మలో ప్రేమించుకొని విడిపోయిన రామలక్ష్మి, సీతాకాంత్.. ఈ జన్నలోనైనా కలుస్తారా లేదా అనే కథాంశంతో మొదలైన ఈ కథ.. మొదటి ఎపిసోడ్ నుండి ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. అందులోను ఇద్దరి భిన్నమైన ఆలోచనలు, అభిప్రాయాలు.. అయితే రామలక్ష్మికి ముందుగానే అభి అనే బాయ్ ఫ్రెండ్ ఉండటంతో కథలో మెలిక మొదలైంది. అభి డబ్బుల కోసం సీతాకాంత్ ని వాడుకోవడంతో నిన్నటి ఎపిసోడ్ లో సీతాకాంత్, రామలక్ష్మి కలిసి అభి వాళ్ళింటికి రావడంతో.. ఇక అభి దొరికేసాడని అందరు అనుకున్నారు. ముగ్గురు సపరేట్ గా కలిసి మాట్లాడారు. అభి చేసే పనులకి, చెప్పే మాటలకి సంబంధం లేదని తన మీద డౌట్ గా ఉందని సీతాకాంత్ ప్రశ్నిస్తాడు. దాంతో రామలక్ష్మితో పాటుగా అభి కూడా షాక్ అవుతాడు.
ఇదిలా ఉండగా నేడు రిలీజైన తాజా ప్రోమోలో .. అర్థరాత్రి అందరు పడుకున్నాక రామలక్ష్మికి అభి కాల్ చేస్తాడు. దాంతో రామలక్ష్మి కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఏంటని రామలక్ష్మి అడుగగా.. నేను మీ ఇంటి ముందే ఉన్నానని రమ్మని చెప్తాడు. దాంతో పరుగున అభి దగ్గరికి వచ్చేస్తుంది రామలక్ష్మి. మనమిద్దరం ఇలా కలవడం కరెక్ట్ కాదు.. ఇంట్లో వాళ్ళు చూస్తే మన నాటకం బయటపడుతుందని రామలక్ష్మి అనగా.. నువ్వంటే ఎంత ప్రేమో నీకు తెలుసు కదా అని అభి అంటాడు. అప్పుడే శ్రీలత మేడ మీద నుండి చూసి.. సందీప్, సీతాకాంత్ అంటు అందరిని పిలుస్తుంది. అందరు కిందకి వచ్చాక.. ఆ అభిగాడు వచ్చాడు.. రామలక్ష్మి, అభి ఆ పొదల వెనుక దాక్కున్నారని అందరితో శ్రీలత చెప్తుంది. మేడ మీద నుండి సీతాకాంత్ చూస్తుంటాడు. మరి అభి, రామలక్ష్మి దొరికిపోతారా లేదా అనే ట్విస్ట్ తో నేటి కథనం ఉండబోతుంది.
Also Read